హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు శ్రీలంకపై ఘన విజయం సాధించింది. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో మంగళవారం జరిగిన ఐదో టీ20 మ్యాచ్లో భారత్ 15 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 5-0తో క్లీన్స్వీప్ చేసింది. ఈ మ్యాచ్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అద్భుత ప్రదర్శన చేసింది. 43 బంతుల్లో 68 పరుగులు చేసింది. హర్మన్ప్రీత్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.…