బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు తెలంగాణ మంత్రి సీతక్క లీగల్ నోటీసు పంపారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ, తన ప్రతిష్టకు భంగం కలిగేలా బీఆర్ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ మంత్రి సీతక్క నోటీసు జారీ చేశారు. మంత్రి తరఫున అడ్వకేట్ నాగులూరి కృష్ణ కుమార్ రిజిస్టర్డ్ పోస్టు ద్వారా…