Ram Temple Inauguration: జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతోంది. దేశవ్యాప్తంగా ప్రజలు, భక్తులు ఈ అద్భుత ఘట్టం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీతో పాటు దేశంలోని పలువురు కీలక వ్యక్తులు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరవుతున్నారు. సాధువులతో పాటు ఫిలిం స్టార్స్, క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు దీనికి హాజరవబోతున్నారు. ఇప్పటికే యూపీ ప్రభుత్వం రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి అన్ని కార్యక్రమాలను చేసింది.