డ్రైనేజీలో భారీ కొండ చిలువ కనిపించడంతో స్థానికులు పరుగులు పెట్టిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. అయితే.. గ్రామానికి సమీపంలో ఓ డ్రైనేజీ కాలువ నుంచి పొలానికి ఇంజిన్ ద్వారా నీటిని తోడుతున్న సమయంలో ఈ భారీ కొండచిలువ బయటకు వచ్చింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో భారీ కొండచిలువ ప్రత్యక్షం కావడంతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.…