దేశ భద్రతను, సంపదను రక్షించేందుకు భారత రక్షణ దళాలు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాయి. అధునాతన ఆయుదాలను త్రివిధ దళాలు సమకూర్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్ఎస్ మహే యుద్ధనౌకను భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ నిర్మించిన మహే శ్రేణిలో ఇది మొదటిది. జనరల్ ఉపేంద్ర ద్వివేది దీనిని స్వావలంబన భారత్ శక్తిగా అభివర్ణించారు. ఈ నౌక శత్రు జలాంతర్గాములను గుర్తించి నాశనం చేస్తుంది.…
భారత నావికాదళం త్వరలో కొత్త వ్యూహాత్మక ఆయుధం, స్వదేశీ మైన్ కౌంటర్ మెజర్ వెసల్స్ (MCMVs) ను పొందే అవకాశం ఉంది. నీటి అడుగున దాగి ఉన్న శత్రువుల ల్యాండ్మైన్లను గుర్తించి నాశనం చేయగల సామర్థ్యం కలిగిన 12 నౌకలను రూ.44,000 కోట్ల వ్యయంతో తయారు చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ యోచిస్తోంది.
ఇండియాకు మరో అరుదైన అవకాశం దక్కింది. ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో ప్రస్తుతం ఇండియా తాత్కాలిక సభ్యదేశంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఆగస్టు నెలకు భద్రతా మండలి అధ్యక్షస్థానంలో ఇండియా ఉండటం విశేషం. ఇండియా అధ్యక్షతన సముద్ర భద్రతపై ఈరోజు బహిరంగ సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి ఇండియా తరపున ప్రధాని మోడి అధ్యక్షత వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగబోతున్నది. భద్రతా మండలిలోని సభ్యదేశాలు, ఐక్యరాజ్య…