Bharath bandh: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాద్వి హిడ్మా ఎన్కౌంటర్కి నిరసనగా నేడు (నవంబర్ 23న) దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తూ పార్టీ ప్రతినిధి అభయ్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన రాసిన లేఖలో.. నిరాయుధులైన హిడ్మా, అతడి భార్య రాజే సహా ఆరుగురు మావోయిస్టులను ఏపీ పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకుని ఆ తరువాత మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో కాల్చి చంపి, దానిని ఎన్కౌంటర్గా చెప్పారని ఆరోపించారు.
CPI Ramakrishna: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో ఈరోజు మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మాను, అతని భార్యతో సహా ఆరుగురిని పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై దుర్మార్గం అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు.