ఏరిగేరి గ్రామంలో ప్రజలకు అండగా ఉంటాం.. నేను కచ్చితంగా ఎమ్మెల్యే అవుతాను.. మీకు పక్కా ఇళ్లు కట్టిస్తాం అని హామీ ఇచ్చారు మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి.. కౌతాళం మండలం ఏరిగేరి గ్రామంలో జరిగిన బాబు ష్యూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంత్రాలయంలో మూడుసార్లు గెలిచాను అని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి.. మంత్రాలయం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడని దుయ్యబట్టారు.