అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ రెడ్డి అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లెలోని ఓ అపార్ట్మెంట్లో ఆయన ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే మంజునాథరెడ్డి మృతికి సహస్ర కంపెనీ నిర్వాహకుడు చక్రధర్ అనే వ్యక్తి కారణమని ఆయన తండ్రి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. చక్రధర్ కు వ్యాపారం నిమిత్తం డబ్బులు తీసుకొని తన…