పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో గ్యాస్ సంక్షోభం నెలకొంది. కానీ ఇప్పటి వరకు భారత్లో మాత్రం అలాంటి పరిస్థితులు రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం విస్తృతంగా తప్పుడు ప్రచారం సాగుతుంది. దీంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు.
PM Modi: మిడిల్ ఈస్ట్ యుద్ధంతో ప్రపంచ మార్కెట్ ఒక్కసారిగా ఉలిక్కిపడుతోంది. ప్రధానంగా ఇంధనం, గ్యాస్ సరఫరాలపై అనిశ్చితి నెలకొంది. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఇంధన కొరత ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తోంది. భారత్లోనూ దీని ఎఫెక్ట్ ఉంది. అయితే.. ప్రస్తుతం భారత్ ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం దేశంలో ఎల్పీజీ కొరత లేదని కేంద్రం చెబుతోంది. కొరత లేనప్పటికీ.. భవిష్యత్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా…