హిందువుల ప్రముఖ పండుగల్లో ఒకటైన శ్రీరామ నవమిని ఈరోజు దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. విష్ణుమూర్తి ఏడవ అవతారమైన రాముడి జన్మదినంగా ఈ పండుగను భావిస్తారు. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్షం నవమి రోజున ఈ పర్వదినం నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం చైత్ర శుక్ల నవమి తిథి మార్చి 26 ఉదయం 11:48 గంటలకు ప్రారంభమై, మార్చి 27 ఉదయం 10:06 గంటలకు ముగుస్తోంది. అందువల్ల వ్రతాచరణ ప్రకారం మార్చి 27నే శ్రీరామ నవమిని…