దేశంలో ఇకపై వ్యక్తులకు సంబంధించిన పర్సనల్ డేటా సురక్షితంగా ఉండనుంది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును విపక్షాల ఆందోళనల నడుమ లోక్సభ సోమవారం ఆమోదించింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం పునరుద్ధరణ తర్వాత తన ట్విట్టర్ బయోను"మెంబర్ ఆఫ్ పార్లమెంట్"గా మార్చారు. మోడీ ఇంటిపేరుపై వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసుపై దిగువ సభ నుంచి సస్పెన్షన్కు గురైన తర్వాత రాహుల్గాంధీ బయో గతంలో "డిస్ క్వాలిఫైడ్ ఎంపీ" అని ఉండేది.
GST On Food Items: మైదా, బియ్యం వంటి నిత్యావసర వస్తువులపై జీఎస్టీని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జీఎస్టీ కౌన్సిల్ నుంచి ఎలాంటి సిఫారసు చేయలేదని పేర్కొంది. లోక్సభలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాలు తెలిపారు.
మహిళలపై జరుగుతున్న నేరాలు, మణిపూర్లో జాతి హింసపై కేంద్రం, ప్రతిపక్షాలు మరోసారి గొంతు చించుకున్నాయి. మణిపూర్లో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాల ఆరోపణలపై అనేక మంది ప్రతిపక్ష ఎంపీలు వరుసగా మూడు రోజుల పాటు లోక్సభ, రాజ్యసభ రెండింటిలోనూ గట్టిగా వాయిదా నోటీసులు సమర్పించారు.
ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటుకు గురైన ఎన్సీపీ నేత మహమ్మద్ ఫైజల్కు భారీ ఊరట లభించింది. ఆయనపై విధించిన అనర్హతను లోక్సభ వెనక్కి తీసుకుంది. ఆయన లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ఎంపీగా తనకు కేటాయించిన తుగ్లక్ లేన్ బంగ్లాను ఖాళీ చేయాలని కాంగ్రెస్కు చెందిన రాహుల్ గాంధీని లోక్సభ హౌసింగ్ ప్యానెల్ కోరింది. పరువు నష్టం కేసులో గుజరాత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో పార్లమెంటుకు అనర్హత వేటు వేసిన రెండు రోజుల తర్వాత లోక్సభ హౌసింగ్ ప్యానెల్ నుంచి తొలగింపు నోటీసు వచ్చింది.
లోక్సభ 64 అధికారిక సవరణలతో ఆర్థిక బిల్లు-2023ని ఆమోదించింది. సీతారామన్ పార్లమెంట్లో ఫైనాన్స్ బిల్లు 2023ని ప్రవేశపెట్టారు. అదానీ సమస్యపై జేపీసీ విచారణను డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీల భారీ నినాదాల మధ్య చివరికి వాయిస్ ఓటింగ్ ద్వారా ఆమోదించబడింది.
రణరంగంలో పోరాడి గెలవాలంటే ధైర్యం, ప్రాణాలను పణంగా పెట్టగల మనోస్థితి లక్షణాలతో పాటు యుద్ధనీతి, పోరాట తంత్రాలు, ఆధునిక ఆయుధాలప్రయోగంలో మెలకువ, నైపుణ్యం కావాలి. ఈ శక్తులన్నీ నేటి మహిళలకు ఉన్నాయి.