ఈరోజు నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు నుంచి ఆగస్టు 13 వరకు ఈ సమావేశాలు జరగబోతున్నాయి. మొత్తం 20 రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సమావేశాలు ప్రారంభమైన తరువాత మొదట కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇటీవల తిరుపతి ఉపఎన్నికలో విజయం సాధించిన వైసీపీ అభ్యర్ధి మద్దిల గురుమూర్తితో సహా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు సభ్యులు ప్రమాణస్వీకారం…