దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో యావత్ ప్రజానీకంతో పాటు ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. దేశంలో ప్రస్తుతం ఒక్కరోజులోనే లక్షలాది కేసులు వెలుగు చూస్తున్నాయని.. చూస్తుండగానే కరోనా సోకిన వారు మన చుట్టూ తిరుగుతున్నారని పవన్ వ్యాఖ్యానించారు. సంక్రాంతిని కుటుంబసభ్యులతో మాత్రమే జరుపుకోవాలని, బయటికెళ్లినప్పుడు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. Read Also: సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారు: వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు కమిట్ అయ్యాడు. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలే కావటం విశేషం. ప్రభాస్ తరహాలో ఏ భారతీయ హీరో ఇలా వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేయలేదు. ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ విడుదలకు రెడీగా ఉంది. ఇక ‘సలార్’, ‘ఆదిపురుష్’ సెట్స్ మీద ఉన్నాయి. ఇవి కాక అశ్వనీదత్ బ్యానరులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కె’ కూడా షూటింగ్ జరుపుకుంటోంది. ఇవి కాకుండా ‘స్పిరిట్’ సినిమా కమిట్…
హైదరాబాద్ కూకట్పల్లిలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం సంభవించింది. కేపీహెచ్బీ రోడ్డు నంబర్ 1 సమీపంలో గాంధీ విగ్రహం వద్ద రోడ్డుపై వెళ్తున్న బైక్ను టిప్పర్ లారీ ఢీకొట్టిన ఘటనలో జగన్మోహన్ రెడ్డి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. టిప్పర్ బైక్ను ఢీకొన్న తర్వాత 20 మీటర్ల పాటు మృతదేహాన్ని టిప్పర్ ఈడ్చుకుని వెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. Read Also: పాలడుగు గ్యాంగ్ రేప్ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు కాగా…
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కరోనా కారణంగా త్వరలో ప్రారంభం కానున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. జనవరి 20 నుంచి 29 వరకు ఒమన్ వేదికగా జరగనున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో ఇండియా మహరాజాస్ జట్టు తరఫున సచిన్ బరిలోకి దిగాల్సి ఉంది. అయితే ఈ లీగ్లో ఆడనని సచిన్ చెప్పడంతో క్రికెట్ అభిమానులు నిరాశకు లోనవుతున్నారు. Read Also: ఐసీసీ అవార్డు రేసులో టీమిండియా యువ…
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. శామీర్పేట మండలం పొన్నాల చెరువులో ఆదివారం ఉదయం ఓ యువతి మృతదేహం లభ్యమైంది. అయితే ఆ యువతి చేతులు కట్టేసి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. గుర్తుతెలియని వ్యక్తులు లైంగిక దాడి చేసి యువతిని హత్య చేసి ఉంటారని.. అనంతరం బాడీని చెరువులో పడేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వాళ్లు ఘటనా స్థలానికి వచ్చి యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక…
తెలంగాణలోని ఖమ్మంలో గత రెండు రోజులుగా ‘మిస్టర్ ఇండియా’ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో మహారాష్ట్ర ఇంకమ్ ట్యాక్స్ డిపార్టుమెంట్కు చెందిన సాగర్ కతుర్డె ‘మిస్టర్ ఇండియా’ టైటిల్ విజేతగా నిలిచాడు. తమిళనాడుకు చెందిన ఆర్.కార్తికేశ్వర్, శర్వణన్ ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. టీమ్ ఛాంపియన్ షిప్లో ఇండియన్ రైల్వేకు ప్రథమ స్థానం లభించగా తమిళనాడు జట్టుకు ద్వితీయ స్థానం లభించింది. విన్నర్గా నిలిచిన ఇండియన్ రైల్వేస్ టీమ్ 225 పాయింట్లు సాధించగా… రన్నరప్గా నిలిచిన తమిళనాడు…
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో శనివారం పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ వచ్చినట్లు స్వయంగా ఆయనే వెల్లడించారు. ఇటీవల తనను కలసిన వారంతా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్సీ సూచించారు. కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. Read Also:…
వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన నియోజకవర్గంలోని సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఇకపై ప్రజలు తాము ఉన్న చోట నుంచే తమ సమస్యలను ప్రస్తావించి పరిష్కరించుకునే విధంగా ప్రజా బంధు పేరుతో నూతన యాప్ను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రజాబంధు యాప్ ద్వారా ప్రజలు తమ సమస్యలను ఇకపై నేరుగా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు. త్వరలో ఈ…
టీమిండియా యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఐసీసీ అవార్డు రేసులో నిలిచాడు. టెస్టు ఫార్మాట్కు సంబంధించి ఐసీసీ ప్రతి నెల ప్రకటించే ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో మయాంక్ అగర్వాల్ ఉన్నాడు. గత ఏడాది డిసెంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్రకటించిన షార్ట్ లిస్టులో టీమిండియా నుంచి మయాంక్ అగర్వాల్, న్యూజిలాండ్ నుంచి అజాజ్ పటేల్, ఆస్ట్రేలియా నుంచి మిచెల్ స్టార్క్ ఉన్నారు. Read Also: రాహుల్ కెప్టెన్సీ వల్లే టీమిండియా ఓడిపోయింది: గవాస్కర్ న్యూజిలాండ్పై…
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్ బయోటెక్ సంస్థ గుడ్న్యూస్ చెప్పింది. రెండు డోసుల టీకా తీసుకున్నవారు ఆరు నెలల తరువాత కొవాగ్జిన్ బూస్టర్ డోసు వేయించుకుంటే కరోనా నుంచి మెరుగైన రక్షణ పొందవచ్చని భారత్ బయోటెక్ తెలిపింది. క్లినికల్ ట్రయల్స్లో ఈ ఫలితం వెల్లడైందని, సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపించలేదని స్పష్టం చేసింది. కొవాగ్జిన్ వ్యాక్సిన్తో నిర్వహించిన బూస్టర్ డోస్ ఫేజ్-2 ప్రయోగ ఫలితాలను భారత్ బయోటెక్ వెల్లడించింది. Read Also:…