ప్రతి డైరెక్టర్ కూ ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. అలా తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మనసులో మాట బయట పెట్టారు దర్శకుడు కొరటాల శివ. శుక్రవారం విడుదల కాబోతున్న ‘ఆచార్య’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ‘ఎప్పటికైనా స్వామి వివేకానందపై చిత్రం తీయాలన్నది తన కోరిక’ అని తెలిపారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు వీక్షించాలంటే ‘గాంధీ’ చిత్రం స్థాయిలో అది ఉండాల’ని కొరటాల అభిప్రాయ పడ్డారు.…