Pawan Kalyan : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది, అంటే 2026 జనవరి 3వ తేదీ శనివారం నాడు ఆయన కొండగట్టు క్షేత్రానికి విచ్చేయనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు కావడంతో అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు భక్తుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఈ పర్యటనలో భాగంగా ఆలయ అభివృద్ధికి సంబంధించి పలు కీలక కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ మంగళవారం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు , అధికారులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆర్చకులు వరుణ్ తేజ్కు ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు.