సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా, ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో పదేళ్ల క్రితం వచ్చిన ‘కొచ్చడైయాన్’ (తెలుగులో ‘విక్రమసింహ’) సినిమా అంతా చూసే ఉంటారు. అయితే తాజాగా ఈ చిత్ర నిర్మాత మురళీ మనోహర్కు మద్రాసు హైకోర్టు గట్టి షాకిచ్చింది. పాత బకాయిలకు సంబంధించి ‘యాడ్ బ్యూరో’ సంస్థకు నాలుగు వారాల్లోగా రూ.2.5 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ ఇచ్చిన గడువులోపు ఈ నగదు చెల్లించకపోతే, ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు తన…