పెట్రోల్, డీజిల్ ధరల పెంపు విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. కేంద్రమంత్రి లాంటి పదవిలో ఉండి కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. బడ్జెట్లో పెట్రోల్, డీజిల్పై కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచిందని తాను నిరూపిస్తానని ఆయన పేర్కొన్నారు. బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, రోడ్ సెస్, సర్ ఛార్జ్ పేరుతో పెట్రోల్పై రూ.22.47ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నులు పెంచిందని హరీష్…
హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం తుది అంకానికి చేరుకుంది. ఈనెల 30న అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పోటీ బీజేపీ-టీఆర్ఎస్ మధ్యే వుంది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం బుజునూరు గ్రామంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈటల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఆత్మ గౌరవానికి, కేసీఆర్ అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నిక హుజురాబాద్ అన్నారు. ఏడేళ్ళుగా తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారు. కేసీఆర్ డబ్బులను నమ్ముకొని ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో జరిగే…
అతి ప్రాచీన కట్టడం అయిన రుద్రేశ్వర దేవాలయము అభివృద్ధికి పాటుపడతానన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో అనేక కట్టడాలు ఉన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయాయన్నారు. కేంద్ర పర్యాటక మంత్రిగా బాధ్యత తీసుకున్న తరువాత.. విద్యావతి తన దగ్గరకు వచ్చి మొదటి విషయం చెప్పిన అంశం రామప్ప దేవాలయం గురించే అన్నారు. చాలా దేశాలు రామప్ప దేవాలయం ను వ్యతిరేకించాయని, అయితే దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏ దేశాలు అయితే రామప్ప గుర్తింపు కు అడ్డుకున్నాయో వాటి…
రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. తెలంగాణకు దసరా ఒక ప్రత్యేకమైన వేడుకగా అభివర్ణించిన ఆయన.. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించ కూడదనే స్ఫూర్తితో చెడు మీద మంచి విజయానికి సంకేతంగా విజయ దశమిని జరుపుకుంటారని తెలిపారు.. ఇక, ఆయురారోగ్యాలు, సిరి సంపదలతో జీవించేలా తెలంగాణ ప్రజలను దీవించాలని దుర్గామాతను దసరా సందర్భంగా ప్రార్థించినట్టు తెలిపారు సీఎం కేసీఆర్.. మరోవైపు.. తెలంగాణ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రజలంతా…
కేంద్ర ప్రభుత్వం తరపున తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజలకి ఈ రోజు కన్నా పండుగ మరొకటి ఉండదు. 17 సెప్టెంబర్ చరిత్రాత్మక రోజు అధికారికంగా నిర్వహించకుండా కాంగ్రెస్, తెరాస లు అన్యాయం చేస్తున్నాయి… ఇది దుర్మార్గం. ఇప్పటికైన కేసీఆర్ తప్పును తెలుసుకొని అమరుల ఆత్మ కు శాంతి చేకూరేలా ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని అన్నారు. రజాకార్ల నేత కాశిం రజ్వి పెట్టిన పార్టీ ఎంఐఎం. మజ్లీస్ కనుసైగల్లో కాంగ్రెస్…
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణలో పర్యాటక అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల నిర్మాణానికి స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకాల కింద కేంద్రం రూ.300 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది.స్వదేశ్ దర్శన్ పథకంలో రాష్ట్రంలో 3 పర్యాటక సర్క్యూట్స్ అభివృద్ధికి రూ.268.39 కోట్లు, ప్రసాద్ పథకం కింద రూ.36.73 కోట్ల మంజూరు చేసింది. బిజెపి తెలంగాణ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీబండి సంజయ్ కుమార్ రాసిన లేఖకు సమాధానమిస్తు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి…
నేడు క్రీడా దినోత్సవం సందర్బంగా తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓయూలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరైయ్యారు. కాగా, మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మరో ఇరువై ఏళ్ళు అక్కడ బీజేపీ, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని కామెంట్స్ చేశారు. తెలంగాణ అభివృద్ధికి మేమంతా కట్టుబడి ఉన్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు. అలాగే…
కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర ఏపీ బీజేపీ నేతలకు ఊపు తెచ్చిందా? లేక ఆ ఒక్క విజిట్తో అంతా తారుమారైందా? ఇంతకీ ఆ భేటీ ముందుగానే ప్లాన్ చేశారా? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్! కేంద్ర పథకాలకు రాష్ట్రాలు స్టిక్కర్లు వేస్తున్నాయని కిషన్రెడ్డి విమర్శ! కేంద్ర కేబినెట్లో పదోన్నతులు పొందిన మంత్రులు.. ఆయా రాష్ట్రాల్లో జన ఆశీర్వాద యాత్రలు మొదలుపెట్టారు. ఆ విధంగా ఏపీకి వచ్చారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి. తిరుపతి,…
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ మునిగిపోతుందని.. దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇక కనిపించదని… కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గెలిచిన తరువాత కాంగ్రెస్ పార్టీ నాయకులు టీ ఆర్ ఎస్ లో చేరారని చురకలు అంటించారు.తనకు మొదటి నుంచి ఒక చెడ్డ లక్షణం ఉంది.. గొంతులో నుంచి మాట్లాడను.. మనసులో నుంచీ మాట్లాడతాననని తెలిపారు. తెలంగాణ రాజకీయ నాయకులు ఏ.ఎస్.ఐ అధ్వర్యంలో కట్టడాలను గుర్తించడం లో వైఫల్యం చెందారని.. మతంతో కట్టడాలకి సంబధం లేదని తెలిపారు.…
హైదరాబాద్ అంబర్పేట్ జన ఆశీర్వాద సభలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. అంబర్పేట్ తన ప్రాణమంటూ… కంటతడి పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తాను ఢిల్లీలో ఉన్నానంటే… అది అంబర్పేట్ వాసుల వల్లే అన్నారు కిషన్రెడ్డి. తెలంగాణలో కల్వకుంట్ల పాలనను తరిమికొడతామన్నారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి. ప్రధాని మోడీ ఏడేళ్లుగా ప్రజల కోసం పనిచేస్తుంటే… సీఎం కేసీఆర్ ఏడేళ్లుగా ఫామ్హౌస్కే పరిమితమయ్యారని అన్నారు. దేశంలో సచివాలయం లేని రాష్ట్రం… తెలంగాణ మాత్రమే అన్నారు కిషన్రెడ్డి. సచివాలయానికి…