దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసేస్తున్నారు. తర్వాత జైలుకు వెళ్లి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇదంతా ఎందుకంటారా? ఓ డాక్టర్ మెడికల్ బిల్లు ఎక్కువ అడిగాడని ఏకంగా ప్రాణాలే తీసేశారు ముగ్గురు మైనర్లు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.