లడఖ్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. సోమవారం ఖర్దుంగ్లా పాస్ను సందర్శించారు. అంతేకాకుండా తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పాంగాంగ్ సరస్సు వద్ద నివాళులర్పించారు. ఖర్దుంగ్లా ప్రాంతానికి రాహుల్ గాంధీ బైక్ పై వెళ్లారు.