శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రిమాండ్లో ఉన్న వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు ధర్మవరం సబ్ జైలుకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వెళ్లగా.. అదే సమయంలో సబ్ జైలు బయట బీజేపీ - వైసీపీ కార్యకర్తలు ఎదురుపడ్డారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.. అయితే, పార్టీ మార్పు ప్రచారంపై సోషియల్ మీడియా వేదికగా స్పందించారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు వైసీపీ నేత కేతిరెడ్డి. 35 ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీతోనే ఉంటున్నామని.. ఇకపై కూడా ఆ కుటుంబంతోనే కలిసి నడుస్తామని పేర్కొన్నారు కేతిరెడ్డి. రాజకీయాల్లో ఉన్నంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వెంటే ఉంటానంటూ క్లారిటీ…
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలుసుగా! రోజూ పొద్దున్నే ఓ 20 మందిని వేసుకుని, వీధులన్నీ తిరుగుతూ, అందరినీ పలకరిస్తూ, పెన్షన్ వచ్చిందా? పథకం వచ్చిందా అంటూ టిపికల్ సీమ యాసలో మాట్లాడుతుంటారు! ఎస్.. ఆయనే! ఈ ఎన్నికల్లో ఓడిపోయిన కేతిరెడ్డి ఇప్పుడేం చేస్తున్నారు? ఈసారి ఆయన ఎత్తిన అవతారమేంటి? ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి! సోషల్ మీడియాను అప్పుడప్పుడు ఫాలో అయ్యేవాళ్లకు కూడా తెలిసిన ఫేస్! ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోజూ పొద్దున్నే ఓ 20-30…