Keshub Mahindra: మన దేశంలో మంచి పేరు సంపాదించిన మల్టీ నేషనల్ కంపెనీల్లో మహింద్రా అండ్ మహింద్రా గ్రూప్ కూడా ఒకటి. వివిధ రంగాలపై ఆ సంస్థ చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదంటే అతిశయోక్తి కాదు. అయితే.. ఆ కంపెనీ సాగించిన అనితర సాధ్యమైన ఈ అద్భుత ప్రయాణంలో ఒక వ్యక్తి పోషించిన పాత్ర సైతం అసమానమైంది.
ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ ఛైర్మన్ కేశబ్ మహీంద్రా కన్నుమూశారు. ఆయన వయసు 99 ఏళ్లు. కేశబ్ మహీంద్రా 1963 నుండి 2012 వరకు మహీంద్రా గ్రూప్ కు ఛైర్మన్గా పనిచేశారు.