KCR: సంగారెడ్డి జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి నేరుగా సుల్తాన్పూర్లోని బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. ప్రజలనుద్దేశించి ప్రసంగించి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరనున్నారు. దీంతో సుల్తాన్పూర్ బహిరంగ సభను లక్ష మందితో నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తున్నది. మెదక్ పార్లమెంట్ పరిధిలోని సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్, జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని అందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల నుంచి ప్రజలు హాజరుకానున్నారు. యువత, రైతులు, మహిళలు ఎక్కువ సంఖ్యలో…