కర్ణాటక కాంగ్రెస్లో కుమ్ములాటలు ఇంకా చల్లారినట్లుగా కనిపించడం లేదు. సిద్ధరామయ్య వర్సెస్ డీకే.శివకుమార్ మధ్య ఇప్పటికే కోల్డ్ వార్ నడుస్తోంది. పవర్ షేరింగ్పై ఇరు వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది.
Karnataka: కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ శనివారం ఉదయం 9:30 గంటలకు ముఖ్యమంత్రి నివాసం కావేరిలో అల్పాహార విందుకు హాజరుకానున్నారు. పార్టీ హైకమాండ్ సూచనల మేరకు ఈ సమావేశం జరుగుతోంది.