దేశ వ్యాప్తంగా పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ కోసం నమోదు కార్యక్రమం అక్టోబర్ 12న ప్రారంభమైంది. నెలకు రూ.5,000 స్టైపెండ్ని అందించే ఈ పథకం శనివారం ప్రారంభమైంది. విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్తో సహా పలు సంస్థల్లో ఆఫర్లు లభించనున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో అత్యధిక ఇంటర్న్షిప్లు ఉన్నాయి. తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.