సీఎం కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో విచ్చలవిడిగా గన్ లైసెన్సులు ఇస్తున్నారని, తనకు గాని తన కుటుంబ సభ్యులకు గానీ ఒక్క రక్తపు బొట్టు కారినా దానికి భాధ్యత సీఎం కేసీఆర్దే అని ఈటల రాజేందర్ హెచ్చరించారు. అంతేకాకుండా.. సీఎం కేసీఆర్కు దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ప్రజాభిప్రాయానికి రావాలని సవాల్ చేశారు. సీఎంను ఓడగొట్టే వరకు…