Vijayawada: విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఉన్న ప్రసిద్ధ కనకదుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి మూడు రోజుల పాటు మహా కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా కుంభాభిషేకం ఉత్సవాలు మార్చి 6 నుంచి మార్చి 8 వరకు వైభవంగా జరగనున్నాయి. మహోత్సవాల తొలి రోజు నేడు ఉదయం 7 గంటలకు కనకదుర్గా నగర్ నుంచి అర్చకులు కలశాలతో ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపు ఘనంగా సాగుతూ ఇంద్రకీలాద్రి చేరుకోనుంది.…