కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పిస్కాల్ తండా శివారులో అప్పుడే పుట్టిన బిడ్డ ఉండటం కలకలం రేపింది. తండా శివారులోని ముళ్ళ పొదలలో నవ జాతి శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లిపోయారు. ఆముళ్లు గుచ్చుకుని ఆశిశువు ఎంత అల్లాడిపోయింది.
చిన్న చిన్న కారణాలతో కొందరు తమ విలువైన ప్రాణాలను తీసుకునే దుస్థికి వస్తున్నారు. అమ్మ తిట్టిందని, ప్రియురాలు కాదనిందని, ఫెయిల్ అయ్యామని, ఎగ్జామ్ బాగా రాయలేదని ఇలాంటి కారణాలు చెబుతూ మనస్తాపానికి గురై బలవత్మరానికి పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లిలో చోటుచేసుకుంది. read also: KCR to go Bihar: బీహార్ వెళ్లనున్న కేసీఆర్. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో త్వరలో ప్రయాణం. పంచశీల అనే యువతి డిగ్రీ పూర్తి చేసి…
ప్రపంచాన్ని కలవరపెడుతున్న మంకీపాక్స్ ఇప్పుడు దేశంలోనూ విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజా తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు గుర్తించారు.
తాగడానికి మంచి నీళ్లు అడిగితే యాసిడ్ బాటిల్ ఇచ్చిన ఘటన నిజామాబాద్ లో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మహమ్మద్నగర్ గ్రామానికి చెందినశనివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి విజయ్ కుమార్ అనే వ్యక్తి దుస్తుల కొనేందుకు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చాడు. అయితే నెహ్రూపార్కు సమీపంలోని ఓ షాపింగ్ మాల్ కి వెళ్ళి దుస్తులు కొనుగోలు చేశారు. కాసేపు ఆ షాపింగ్ మాల్ లో తిరిగిన అనంతరం దాహం వేయడంతో విజయ్ కుమార్ సిబ్బందిని…
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి. కొందరు అమాయకులు గూగుల్లో దొరికే కస్టమర్ కేర్ నంబర్లకు కాల్ చేసి దారుణంగా మోసపోతున్నారు. తెలంగాణలో ఓ విద్యార్థి కూడా ఇదే తరహాలో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని మోసపోయాడు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన సుంకరి సాగర్ వద్ద కమీషన్ పేరుతో 99,232 రూపాయలను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. వివరాల్లోకి వెళ్తే.. గత నెల 5వ తేదీన పార్ట్ టైం జాబ్ కోసం సుంకరి…
తెలంగాణలో ఆశా వర్కర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా 27వేల మంది ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వబోతున్నట్లు మంత్రి హరీష్రావు ప్రకటించారు. ఈ మేరకు ఆశావర్కర్లకు మొబైల్స్ ఆందించే రాష్ట్ర స్థాయి కార్యక్రమం కామారెడ్డి జిల్లాలో ప్రారంభం కావడం శుభసూచకమన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందజేయాలనే ఉద్దేశంతో స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి హరీష్రావు తెలిపారు. మరోవైపు ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు.…
కామారెడ్డి జిల్లాలో భూమ్బాయి అనే వ్యక్తి మృతి చెందగా.. పోలీసులు కొట్టడం వల్లే తన భర్త చనిపోయాడని మహిళ ఆరోపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. రెండు రోజుల క్రితం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనలో పేకాట ఆడుతున్న నిందితులను స్టేషన్కు తీసుకువెళ్లి పోలీసులు చితకబాదడంతో భూమ్బాయికి తీవ్రగాయాలయ్యాయి. ఆయన్ను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి…
తాము అండగా ఉంటామంటూ మృతిచెందిన రైతు కుటుంబానికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామానికి చెందిన చిన్న బీరయ్య.. 10 రోజులుగా వడ్లు అమ్ముకోవడానికి వచ్చి గుండె ఆగి మరణించిన విషయం తెలిసిందే.. ఇక, వడ్ల కుప్ప మీద తనువు చలించిన రైతు బీరయ్య కొడుకు రాజేందర్ తో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ నాయకులు సుభాష్ రెడ్డి గ్రామానికి వెళ్లి బీరయ్య…
కామారెడ్డి జిల్లాలో ఆర్మీ జవాన్ అదృశ్యం కలకలం సృష్టిస్తోంది.. కామారెడ్డి మండలం తిమ్మక్పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ కెంగర్ల నవీన్ కుమార్ (28)… గత ఆరు రోజుల క్రితం అదృశ్యం అయ్యాడు.. ఆగస్టు 4వ తేదీన జోధ్పూర్ నుంచి సెలవు పైన స్వగ్రామం వచ్చిన జవాన్ నవీన్ కుమార్.. గత నెల 29వ తేదీన అర్ధరాత్రి కామారెడ్డి నుంచి హైదరాబాద్ బయల్దేరాడు.. అయితే, ఆగస్టు 30వ తేదీ నుంచి నవీన్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో…