రేపు ఎన్డీయే ముఖ్యమంత్రుల, ఉపముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ప్రధాని అధ్యక్షతన జరగనున్న ఎన్డీయే సమావేశం నిర్వహించనున్నారు. సుపరిపాలన, ఉత్తమ పద్ధతులపై ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంలు చర్చించనున్నారు. సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచనతో ఆమె పోస్టును సోషల్ మీడియా నుంచి తొలగించింది. జేపీ నడ్డా సలహాతో పోస్టును తొలగించినట్లు కంగనా రనౌత్ స్పష్టం చేసింది.
Tiranga Yatra: భారత సైనిక దళాల ధైర్యసాహసాలను స్మరించుకుంటూ బీజేపీ పార్టీ మంగళవారం (మే 13) నుంచి దేశవ్యాప్తంగా ‘తిరంగా యాత్ర’ను ప్రారంభించనుంది. ఈ యాత్ర మే 13 నుంచి మే 23 వరకు 11 రోజుల పాటు కొనసాగనుంది. తాజాగా విజయవంతంగా ముగిసిన ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ఈ యాత్ర మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక నేడు సాయంత్రం 4 గంటలకు ఈ యాత్ర ప్రారంభం కానుంది. దేశభక్తి, ఐక్యత, సైనికుల సేవలకు గౌరవం తెలిపేలా…
BJP MP: వక్ఫ్ సవరణ చట్టంపై విచారణ, రాష్ట్రపతికి బిల్లుల విషయంలో సుప్రీంకోర్ట్ డెడ్లైన్ విధించడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై బీజేపీలోకి కొంత మంది సుప్రీంకోర్టుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, సుప్రీంకోర్టుపై బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వారసుడిగా ఎవరొస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ప్రకటించనుంది. ఏప్రిల్ 22, 23 తేదీల్లో ప్రధాని మోడీ సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు.
BJP: భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి కొత్త చీఫ్ రాబోతున్నారు. ఏప్రిల్ మూడో వారం నాటికి బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు అధ్యక్షులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఏప్రిల్ 4న పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ఊపందుకుంటుందని తెలుస్తోంది.
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు ఛాతీ నొప్పితో బాధపడ్డారు. దీంతో హుటాహుటినా ఆయన్ను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)కు తరలించారు
నా మాటలు రాసి పెట్టుకోండి ఢిల్లీ పీఠంపై బీజేపీ పార్టీ జెండా ఎగురవేస్తామని జేపీ నడ్డా అన్నారు. ఇక, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఒక అబద్ధాల ఎన్సైక్లోపీడియా’ అంటూ మండిపడ్డారు.
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అధికార-ప్రతిపక్ష నేతల విమర్శలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇక సమయం తక్కువగా ఉండడంతో అగ్ర నేతలంతా ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కొత్త జాతీయ అధ్యక్షుడిని నియమించనుంది. ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీలోపు పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీ ఎన్నికల వరకు బీజేపీకి నాయకత్వం వహిస్తారు. అధ్యక్షుడిగా ఆయన పదవీకాలం 2024 జనవరిలో ముగియాల్సి ఉంది. అయితే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నడ్డా పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించారు.