నటి జియాఖాన్ మృతి కేసులో ముంబై సీబీఐ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఆమె ప్రియుడు, నటుడు సూరజ్ పంచోలీని నిర్దోషిగా న్యాయస్థానం ప్రకటించింది. సూరజ్ వల్లే జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాల లేనందునా.. అతన్ని నిర్దోషిగా తేలుస్తూ విడుదల చేస్తున్నట్లు సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఏఎస్ సయ్యద్ తీర్పు చెప్పారు.
Jiah Khan Suicide Case: బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన నటి జియాఖాన్ ఆత్మహత్య కేసులో రేపు సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రేమ వ్యవహారంతో ముడిపడి ఉన్న ఈ ఆత్మహత్య కేసు 2013లో సంచలనం రేపింది. జూన్ 3, 2013లో ముంబైలోని తన ఇంట్లో నటి జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో ముంబైలోని స్పెషల్ సీబీఐ కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.