Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్కి పూర్తిస్థాయిలో రాష్ట్ర హోదా కల్పించాలని, ఆ రాష్ట్ర కేబినెట్ కేంద్రాన్ని కోరింది. ఈ తీర్మానానికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతం నుంచి రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని సీఎం ఒమర్ అబ్దుల్లా మంత్రి వర్గం కేంద్రాన్ని కోరింది. తాజా తీర్మానం జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా గుర్తింపును పునురుద్ధరించే ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు.