రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు. పర్యటన వివరాలను అధికారులు వెల్లడించారు. ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నుంచి బయలు దేరి.. 10.20 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు.
తిరుపతి పర్యటనలో సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీసీఎల్ గ్రూప్కు చెందిన ప్యానెల్ ఆప్టో డిస్ప్లే టెక్నాలజీ లిమిటెడ్ (POTPL), డిక్సాన్ టెక్నాలజీస్, ఫాక్స్ లింక్, సన్నీ ఆప్టో టెక్ కంపెనీలకు సీఎం జగన్ భూమి పూజ చేశారు. టీసీఎల్ కంపెనీ తిరుపతిలో టీవీ ప్యానెళ్లను తయారుచేయనుంది. రూ.1230 కోట్లతో టీసీఎల్ గ్రూప్ ఈ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 3,174 మందికి ఉపాధి కలగనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ట్రయల్…