Shubhanshu Shukla: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) నుంచి డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ భూమి పైకి ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆక్సియం-4 మిషన్ ద్వారా నలుగురు వ్యోమగాములు 18 రోజులు ఐఎస్ఎస్ లో ఉన్న తర్వాత భూమికి తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ నలుగురిలో భారతదేశానికి చెందిన శుభాన్షు శుక్లా కూడా ఉన్నారు. 22 గంటల ప్రయాణం తర్వాత ఆయన భూమికి చేరుతారు.