హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మరణం తర్వాత, ఇజ్రాయెల్ ఇప్పుడు లెబనాన్ రాజధాని బీరూట్లోని నివాస ప్రాంతాలపై కూడా దాడి చేస్తోంది. తొలిసారిగా బీరుట్లోని నివాస భవనాలపై ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు సమాచారం. బీరుట్ శివారు ప్రాంతాలే కాకుండా, ఆదివారం సాయంత్రం నుంచి బీరుట్లో కూడా ఇజ్రాయెలీ డ్రోన్లు కనిపించాయి.