లెబనాన్లో ఉన్న హిజ్బుల్లాను పూర్తిగా నిర్మూలించేందుకు ఇజ్రాయెల్ నిరంతరం దాడి చేస్తోంది. మొదట సంస్థ అధిపతి సయ్యద్ హసన్ నస్రల్లా, అతని కుమార్తె, అనేక మంది టాప్ కమాండర్లు చంపబడ్డారు. అదే సమయంలో, సిరియా రాజధాని డమాస్కస్లోని ఒక ఫ్లాట్పై జరిగిన దాడిలో నస్రల్లా అల్లుడు హసన్ జాఫర్ అల్ ఖాసిర్ మరణించాడు. హిజ్బుల్లాకు చెందిన మీడియా కూడా దీనిని ధ్రువీకరించింది
ఇరాన్ క్షిపణి దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయం పెరుగుతోంది. కాగా, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతపై అభివృద్ధి చెందిన దేశాల సమూహం జీ-7 అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ప్రస్తుత ఛైర్పర్సన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఈ సమావేశానికి పిలుపునిచ్చారు.
ఇరాన్ ఇజ్రాయెల్పై అనేక క్షిపణులను ప్రయోగించింది. దీని కారణంగా ఇజ్రాయెల్ పౌరులు సురక్షితమైన ప్రదేశాలలో ఆశ్రయం పొందవలసి వచ్చింది. ఈ దాడి తర్వాత ఇరాన్లో వేడుకలు ప్రారంభమయ్యాయి. మంగళవారం అర్థరాత్రి వరకు ఈ దాడి కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం గురించి తక్షణ సమాచారం అందలేదు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ కీలక ప్రకటన చేశారు.
ఇజ్రాయెల్ దూకుడును లెక్కచేయకుండా చాలా కాలంగా సంయమనం పాటిస్తున్న ఇరాన్ మంగళవారం రాత్రి వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. ఇరాన్ క్షిపణి దాడుల తర్వాత ఇజ్రాయెల్ ఆగ్రహంతో ఉంది. ఇరాన్పై ప్రతీకారం తీర్చుకుంటానని బెదిరించింది. ఇప్పుడు ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలే ఇజ్రాయెల్ తదుపరి లక్ష్యమని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది సంఘర్షణను మరింత తీవ్రతరం చేయడమే కాకుండా ప్రపంచాన్ని మూడవ ప్రపంచ యుద్ధం వైపు తీసుకెళుతుందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఫ్రాన్స్ చేరుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇతర సీనియర్ అధికారులతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత కారణంగా, ప్రపంచం మొత్తం మూడవ ప్రపంచ యుద్ధం ముప్పును ఎదుర్కొంటోందని అనడంలో తప్పేం లేదు. అదే ఇరాన్, ఇజ్రాయెల్ ఒకప్పుడు స్నేహితులు కూడా? రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్న నేపథ్యంలో, ఈ దేశాల చరిత్రను మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి.
ఇజ్రాయెల్పై ఇరాన్ మంగళవారం క్షిపణుల వర్షం కురిపించింది. దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ ఇజ్రాయెల్పై ప్రయోగించింది. ఇరాన్ దాడుల తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ దాడుల్లో ఒకరు మరణించినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దాడుల తర్వాత ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ బెదిరించింది
పశ్చిమాసియా ప్రాంతీయ యుద్ధం అంచున నిలిచింది. హెజ్బొల్లా, హమాస్ అగ్రనేతలను అంతమొందించిన ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. నివేదికల ప్రకారం, ఇరాన్ ఇజ్రాయెల్పై 200 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ దాడిపై అమెరికా అంతకుముందే అలర్ట్ చేసింది. ఈ హెచ్చరికను దృష్టిలో ఉంచుకుని, ఇజ్రాయెల్లో నివసిస్తున్న భారతీయ పౌరులకు భారతదేశం ఒక అడ్వైజరీ జారీ చేసింది.
లెబనాన్లోని హిజ్బుల్లాపై సైనిక చర్యను ప్రారంభించిన ఇజ్రాయెల్పై ఇరాన్ మంగళవారం క్షిపణులను ప్రయోగించింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా, హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా మృతికి ప్రతీకారంగా ఈ దాడి జరిగిందని, ఎలాంటి ప్రతీకార చర్యలనైనా ఎదుర్కొనేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని ఇరాన్ ప్రకటించింది.
Israel-Iran War: ఇరాన్ మంగళవారం రాత్రి ఇజ్రాయెల్పై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా సైనిక, భద్రతా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నుండి ఒక ప్రకటనను తెలియపరుస్తూ, ఇరాన్ నుండి ఇజ్రాయెల్ వైపు పెద్ద సంఖ్యలో క్షిపణులను ప్రయోగించినట్లు మీడియా నివేదికలు ధృవీకరించాయి. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇరాన్కు హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఇరాన్ భారీ తప్పు చేసిందని, దానికి…