Jurala : ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో తెలంగాణలో గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు శనివారం రాత్రి ప్రాజెక్టులోని 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 1,30,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చుండగా, 1,44,076 క్యూసెక్కుల నీటిని ఔట్ఫ్లోగా విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జూరాల డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.518 మీటర్లు…
Harish Rao : జనగామ జిల్లా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు మాట్లాడుతూ, ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యం వల్లే పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. దేవాదుల ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో మోటార్లు పనిచేయలేదని, చెరువులు నింపుకోలేకపోవడంతో రైతుల పంటలు తీవ్ర నష్టానికి గురయ్యాయని ఆరోపించారు. “ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గ్రహం…