అమెరికా-ఇరాన్ మధ్య వార్నింగ్ల పరంపర కొనసాగుతోంది. మొన్నటిదాకా ట్రంప్ పదే పదే ఇరాన్ను హెచ్చరిస్తూ వచ్చారు. ఇప్పుడు అమెరికాకు ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిసెంబర్ 28 నుంచి పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం సాగుతోంది. నిన్నామొన్నటి దాకా క్షిపణులతో దాడులు చేసుకోగా.. తాజాగా వార్నింగ్లు ఇచ్చుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఇరాన్ హెచ్చరించింది.