హాకీ ఆసియా కప్ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో దక్షిణ కొరియాను 4-1 తేడాతో ఓడించి భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ టైటిల్ను గెలుచుకుంది. భారత్ నాలుగోసారి ఆసియా కప్ ట్రోఫీని గెలుచుకుంది. ఖండాంతర టోర్నమెంట్ను గెలుచుకోవడంతో భారత జట్టు వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్తంగా నిర్వహించనున్న ప్రపంచ కప్కు అర్హత సాధించింది. రాజ్గిర్లో జరిగిన ఫైనల్లో సుఖ్జీత్, దిల్ప్రీత్, అమిత్ భారత్ తరఫున గోల్స్ సాధించారు.
పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుతో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్లో మాట్లాడారు. జట్టు విజయం సాధించినందుకు మోడీ అభినందనలు తెలిపారు. జట్టు అనుభవజ్ఞుడైన గోల్కీపర్ పీఆర్ శ్రీజేష్కు ప్రత్యేక విజ్ఞప్తి కూడా చేశారు. శ్రీజేష్కి ఇదే చివరి మ్యాచ్ కావడంతో అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలికాడు.
భారతదేశానికి 41 ఏళ్ల తర్వాత ఒలంపిక్స్ లో హాకీలో పతకం రావడం పట్ల మన తారలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పతకం గెలిచి దేశ ప్రతిష్టను పెంచిన హాకీజట్టుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు నందమూరి బాలకృష్ణ. హాకీ జట్టు కఠోర శ్రమతోనే పతకం లభించింది. దేశ ప్రజల ఆశీస్సులు, మన్ననలు క్రీడా కారులకు ఎల్లవేళలా వుంటాయి. దేశం గర్వించేలా ఒలంపిక్స్ లో క్రీడాకారులు పోరాడుతున్నారు. ఒలంపిక్స్ లో ఇతర క్రీడాకారులు కూడా మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను…