Special Story on Indian Digital Currency: మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించారు. అంతకుముందు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ‘‘సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ’’పై కాన్సెప్ట్ నోట్ను విడుదల చేసింది. దీంతో ఇప్పుడు ఈ కొత్త డిజిటల్ కరెన్సీ ఆసక్తికరమైన చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.