కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేసింది.. ఫస్ట్ వేవ్ కంటే.. భారీగా కేసులు, ఎక్కువ సంఖ్యలో మృతులు కలవరానికి గురిచేశాయి.. బెడ్లు, ఆక్సిజన్ దొరకక అల్లాడిపోయిన పరిస్థితి.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. క్రమంగా కేసులు దిగివచ్చాయి.. ఇక, చికిత్సపై నుంచి వ్యాక్సినేషన్పై ఫోకస్ పెడుతోంది ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్రం.. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.. కరోనా వ్యాప్తిని…
కరోనా బారినపడి కొంతమంది మావోయిస్టులు మృతిచెందినట్టు ప్రచారం జరుగూతేఉంది.. అయితే.. కరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం.. కేవలం పోలీసుల సృష్టి మాత్రమే అంటున్నారు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ… ఇక, కరోనా సెకండ్ వేవ్ ప్రబలడానికి దేశ పాలకులే కారణం అని ఆరోపించారు ఆ పార్టీ అధికార ప్రధినిధి అభయ్.. కరోనా మహమ్మారితో మావోయిస్టుల మృతి అంటూ పోలీసులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ నిరభ్యంతరంగా, మావోయిస్టు కేంద్ర కమిటీ ఖండిస్తుందంటూ ఓ ప్రకటన…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో నాలుగు లక్షలకు పైగా నమోదవ్వగా, ఇప్పుడు ఆ కేసుల సంఖ్య లక్షకు దిగువగా వస్తున్నాయి. తాజాగా కేంద్రం కరోనా బులిటెన్ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 60,753 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,98,23,546కి చేరింది. ఇందులో 2,86,78,390 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 7,60,019 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇకపోతే, గడిచిన 24 గంటల్లో…
అభిమానులు అంత ఎంతగానో ఎదురు చూస్తున ప్రతిష్టాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ తొలి రోజు ఆట వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. అయితే రెండో రోజు ఆట కూడా జరిగే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. భారత కాలమాన ప్రకారం రెండో రోజు ఆట మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. నిన్న ఉదయం నుంచి సౌథాంప్టన్లో వర్షం కురవడంతో.. తొలి రోజు ఆట సగం రోజు వరకు సాగలేదు. అయితే…
2017 లో ఆండ్రాయిడ్ వినియోగదారులను జోకర్ మాల్వేర్ ముచ్చెమటలు పట్టించింది. మనకు తెలియకుండానే యాప్లలో వచ్చే యాడ్స్ రూపంలో ఈ మాల్వేర్ మన మొబైల్లోకి ప్రవేశించి, మన ఎకౌంట్లోని డబ్బులను గుంజేస్తుంది. ఎకౌంట్ నెంబర్ నుంచి, బ్యాంక్ల నుంచి వచ్చే మెసేజ్లను ఈ మాల్వేర్ నియంత్రిస్తుంది. అత్యంత ప్రమాదకరమైన ఈ మాల్వేర్ను గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ మాల్వేర్ను గుర్తించి పూర్తిగా తొలగించడానికి మూడేళ్ల సమయం పట్టినట్టు గూగుల్ సంస్థ ప్రకటించింది. …
కేంద్రానికి, ట్విట్టర్కు మధ్య వార్ జరుగుతున్నది. కేంద్రం జారీ చేసిన ఐటీ మార్గదర్శకాలను ట్విట్టర్ అంగీకరించలేదు. గడువు దాటిన తరువాత సెంట్రల్ కంప్లయిన్స్ ఆఫీసర్ను ఏర్పాటు చేయడంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్రం ఏర్పాటు చేసిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందు ట్విట్టర్ ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. శశిథరూర్ ఆధ్వర్యంలో ఐటీ వ్యవహారాలపై ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ట్విట్టర్ తీసుకుంటున్న చర్యలను వివరించేందుకు ఈ స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. Read: రివ్యూ: ఇన్…
ఇండియాలో కరోనా కేసులతో పాటుగా మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. దేశంలో కొత్తగా 62,480 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,62,793 కి చేరింది. ఇందులో 2,85,80,647 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 7,98,656 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 1,587 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,83,490 కి చేరింది.…
పెట్రో బాదుడు కొనసాగుతూనే ఉంది.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. పెట్రో ధరలకు బ్రేక్ పడింది.. ఇక, ఆ తర్వాత మే 4వ తేదీ నుంచి వరుసగా పెరుగుతూ పోతున్నాయి చమురు ధరలు.. ఇప్పటి వరకు 27 సార్లు వడ్డించాయి చమురు కంపెనీలు.. ఇక, ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలను మరింత పెంచారు.. లీటర్ పెట్రోల్పై 27 పైసలు, లీటర్ డీజిల్పై 30 పైసల చొప్పున పెంచాయి ఆయిల్ సంస్థలు.. తాజా వడ్డింపుతో కలిపి హైదరాబాద్లో…
భారత్ లో కొనసాగుతున్న రెండవ విడత “కరోనా” వైరస్ విజృంభణ తగ్గుతూ వస్తుంది. అయితే.. పాజిటివ్ కేసులు తగ్గుతున్న… “కరోనా” మరణాలు మాత్రం ఆగడం లేదు. తాజా కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 67,208 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,00,313 కి చేరింది. ఇందులో 2,84,91,670 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 8,26,740 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 2,330…
భారత్లో వంట నూనెల ధరలు మంట పెట్టాయి.. సామాన్యుడు వంట నూనె కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.. కొన్ని బ్రాండ్ల నూనెల ధరలు ఓపెన్ మార్కెట్లో ఏకంగా 200కు చేరువయ్యాయి.. గత కొన్ని రోజులుగా క్రమంగా పైకి ఎగబాకుతూ పోయాయి.. అయితే, ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టాయని వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాలశాఖ ప్రకటించింది.. కొన్ని రకాల వంటనూనెల ధరలు దాదాపు 20 శాతం వరకు తగ్గాయని పేర్కొంది.. పామ్ ఆయిల్ ధర 19 శాతం…