లార్డ్స్ టెస్టులో చేతులెత్తేసిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో…భారత్ బ్యాట్స్మెన్లు పోరాడుతున్నారు. నాలుగో రోజు ఆట నిలిచిపోయేసరికి 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను ముందుగానే నిలిపివేశారు. రిషభ్ పంత్ 14 పరుగులు, ఇషాంత్ శర్మ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. చివరి రోజు రిషబ్ పంత్ ధాటిగా ఆడి పరుగులు సాధిస్తే….భారత్ ఓటమి నుంచి గట్టెక్కే అవకాశాలు ఉన్నాయ్. పంత్కు…టెయిలెండర్లు ఎలా సహకారం అందిస్తారన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠగా మారింది. సిడ్నీ టెస్టులో మాదిరిగా రాణిస్తే…ఈ టెస్టు మ్యాచ్ కూడా డ్రా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యర్థికి 250 పరుగుల టార్గెట్ కూడా విధించకపోతే…మనకు కష్టాలే. ఇంగ్లీష్ జట్టుపై వీలైనన్ని ఎక్కువ పరుగులు చేస్తే…భారత్ ఓటమి తప్పినట్లే.
Also Read
- Virat Kohli: సెంచరీ కొట్టినా సెలబ్రేషన్స్ ఎందుకు జరుపుకోలేదు?.. కోహ్లీ ఇచ్చిన ఆన్సర్ వింటే ఫిదా అవ్వాల్సిందే!
- IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
- Sarah Taylor: చారిత్రక నిర్ణయం.. పురుషుల జట్టుకు తొలి మహిళా కోచ్ గా సారా టేలర్..
- IPL 2026: RCB Vs KKR మ్యాచ్కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే.. RCB పరిస్థితి..?
అంతకుముందు అజింక్య రహానె చతేశ్వర్ పుజారా…నాలుగో వికెట్కు శతక భాగస్వామ్యం నెలకొల్పారు. 55 పరుగులకే ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విఫలమవడంతో రహానె, పుజారా కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. ఈ క్రమంలోనే ఇద్దరూ వంద పరుగుల భాగస్వామ్యం నమోదుచేశారు.ఇద్దరు క్రీజులో కుదురుకున్నారని అనుకునే లోపే…పూజారా ఊహించని బంతికి పెవిలియన్ చేరాడు. కాసేపటికే అర్ధ శతకంతో కొనసాగుతున్న రహానె కూడా ఔటయ్యాడు. మోయిన్ అలీ బౌలింగ్లో కీపర్ చేతికి చిక్కాడు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న రవీంద్ర జడేజా నిరాశపరిచాడు. మోయిన్ అలీ బౌల్డ్ చేయడంతో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. అలా స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి మ్యాచ్పై పట్టు కోల్పోయింది. తర్వాత బ్యాటింగ్కు వచ్చిన పంత్, ఇషాంత్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. 82 ఓవర్ల తర్వాత వెలుతురు లేమి కారణంగా…అంపైర్లు ఆటను నిలిపివేశారు. అంతకుముందు రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తక్కువ స్కోరుకు పెవిలియన్ చేరారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్వుడ్ మూడు, మోయిన్ అలీ రెండు వికెట్లు తీశారు.
- Tags
- england
- india
- lords
- Test series
తాజావార్తలు
-
Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
-
Spirit : స్పిరిట్.. ఇది కదా కావాల్సింది!
-
Virat Kohli Chase Master: విరాట్ కోహ్లీ కొడితే అర్సిబీ గెలవాల్సిందే.. షాకింగ్ గణాంకాలు ఇవే!
-
PEDDI POWERPLAY TOUR : ‘పెద్ది’ ప్రమోషనల్ టూర్ ప్లాన్ వచ్చేసింది
-
VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!