లార్డ్స్ టెస్టులో చేతులెత్తేసిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో…భారత్ బ్యాట్స్మెన్లు పోరాడుతున్నారు. నాలుగో రోజు ఆట నిలిచిపోయేసరికి 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను ముందుగానే నిలిపివేశారు. రిషభ్ పంత్ 14 పరుగులు, ఇషాంత్ శర్మ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. చివరి రోజు రిషబ్ పంత్ ధాటిగా ఆడి పరుగులు సాధిస్తే….భారత్ ఓటమి నుంచి గట్టెక్కే అవకాశాలు ఉన్నాయ్. పంత్కు…టెయిలెండర్లు ఎలా సహకారం అందిస్తారన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠగా మారింది. సిడ్నీ టెస్టులో మాదిరిగా రాణిస్తే…ఈ టెస్టు మ్యాచ్ కూడా డ్రా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యర్థికి 250 పరుగుల టార్గెట్ కూడా విధించకపోతే…మనకు కష్టాలే. ఇంగ్లీష్ జట్టుపై వీలైనన్ని ఎక్కువ పరుగులు చేస్తే…భారత్ ఓటమి తప్పినట్లే.
Also Read
- PV Sindhu: జపాన్ ఓపెన్లో పీవీ సింధు చరిత్ర.. 16 ఏళ్ల తర్వాత సెమీస్లోకి దూసుకెళ్లిన రెండో భారత మహిళా షట్లర్
- Rohit Sharma: హిట్మ్యాన్ రిటైర్మెంట్పై జోరుగా చర్చ.. టీమిండియా కోచ్ కీలక ప్రకటన
- Mithali Raj: ఇకనైనా 'స్మృతి మందాన'ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
- Rohit Sharma Retirement: లార్డ్స్లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా..!
అంతకుముందు అజింక్య రహానె చతేశ్వర్ పుజారా…నాలుగో వికెట్కు శతక భాగస్వామ్యం నెలకొల్పారు. 55 పరుగులకే ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విఫలమవడంతో రహానె, పుజారా కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. ఈ క్రమంలోనే ఇద్దరూ వంద పరుగుల భాగస్వామ్యం నమోదుచేశారు.ఇద్దరు క్రీజులో కుదురుకున్నారని అనుకునే లోపే…పూజారా ఊహించని బంతికి పెవిలియన్ చేరాడు. కాసేపటికే అర్ధ శతకంతో కొనసాగుతున్న రహానె కూడా ఔటయ్యాడు. మోయిన్ అలీ బౌలింగ్లో కీపర్ చేతికి చిక్కాడు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న రవీంద్ర జడేజా నిరాశపరిచాడు. మోయిన్ అలీ బౌల్డ్ చేయడంతో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. అలా స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి మ్యాచ్పై పట్టు కోల్పోయింది. తర్వాత బ్యాటింగ్కు వచ్చిన పంత్, ఇషాంత్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. 82 ఓవర్ల తర్వాత వెలుతురు లేమి కారణంగా…అంపైర్లు ఆటను నిలిపివేశారు. అంతకుముందు రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తక్కువ స్కోరుకు పెవిలియన్ చేరారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్వుడ్ మూడు, మోయిన్ అలీ రెండు వికెట్లు తీశారు.
- Tags
- england
- india
- lords
- Test series
తాజావార్తలు
-
PV Sindhu: జపాన్ ఓపెన్లో పీవీ సింధు చరిత్ర.. 16 ఏళ్ల తర్వాత సెమీస్లోకి దూసుకెళ్లిన రెండో భారత మహిళా షట్లర్
-
Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
-
Delhi Police Commissioner: ఢిల్లీకి కొత్త పోలీస్ బాస్.. ఎవరు ఈ అనురాగ్ కుమార్..?
-
Hydrogen Fuel Cell Train: తొలి “హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్” రైలు షురూ.. రూ.14,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..!
-
TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?