India Vs Zimbabwe: హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో కూడా టీమిండియానే టాస్ గెలిచింది. ఈ సందర్భంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి ఫీల్డింగ్ తీసుకునేందుకే మొగ్గు చూపించాడు. తొలివన్డేలో కూడా టీమిండియా టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా జింబాబ్వేను 189 పరుగులకే భారత బౌలర్లు కట్టడి చేశారు. అదే తరహాలో రెండో వన్డేలో కూడా తక్కువ పరుగులకే ప్రత్యర్థిని కట్టడి చేసేలా టీమిండియా ప్రణాళికలు రచించింది. ఇప్పటికే మూడు…
Ind Vs Zim: జింబాబ్వే గడ్డపై ఆ దేశ జట్టుతో టీమిండియా నేడు రెండో వన్డే ఆడనుంది. మూడు వన్డేల సిరీస్లో ఇప్పటికే టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో సునాయాసంగా విజయం సాధించింది. రెండో వన్డేలోనూ టీమిండియా ఫేవరేట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్కు మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమైన నేపథ్యంలో ఈ వన్డేలో అతడు ఓపెనింగ్కు వస్తాడా లేదా మిడిలార్డర్లోనే…
Team India Record: జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మేరకు టీమిండియా ఒకే ఏడాదిలో ఈ ఘనత సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జులైలో ఇంగ్లాండ్ను 10 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. అప్పుడు భారత ఓపెనర్లు 197 పరుగుల టార్గెట్ను వికెట్ కోల్పోకుండా ఛేదించారు. ఇప్పుడు జింబాబ్వేపై 192 పరుగుల టార్గెట్ను కూడా వికెట్లేమీ కోల్పోకుండా ఛేజ్ చేసి గెలిపించారు.…
Ind Vs Zim: హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 190 పరుగుల విజయ లక్ష్యాన్ని ఊదిపడేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్ తలో 3 వికెట్లు తీసి జింబాబ్వేను కట్టడి చేశారు. ఈ నేపథ్యంలో 190 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఒక్క వికెట్…
Ind Vs Zim: హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు.. తర్వాత పట్టు సడలించారు. దీంతో జింబాబ్వే టెయిలెండర్లు రాణించారు. సుదీర్ఘ విరామం అనంతరం రీఎంట్రీ ఇచ్చిన దీపక్ చాహర్ తొలి మ్యాచ్లోనే సత్తా…
IND Vs ZIM: ప్రస్తుతం జింబాబ్వేలో పర్యటిస్తున్న టీమిండియాలో మరో మార్పు చోటు చేసుకుంది. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన చేసింది. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో షాబాజ్ అహ్మద్ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ తెలియజేసింది. ఇంగ్లండ్లో కౌంటీ క్రికెట్ ఆడుతుండగా వాషింగ్టన్ సుందర్ భుజానికి గాయమైంది. ఆగస్టు 10న ఓల్డ్ ట్రాఫోర్డులో లాంక్షైర్కు ఆడుతూ ఓ మ్యాచ్లో డైవ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో అతడు జింబాబ్వే టూర్కు దూరమయ్యాడు. ప్రస్తుతం సుందర్ రిహాబిలిటేషన్ కోసం బెంగళూరులోని…
Zimbabwe: ప్రస్తుతం టీమిండియా వరుస పర్యటనలతో బిజీబిజీగా గడుపుతోంది. ఈనెల 18 నుంచి జింబాబ్వే గడ్డపై మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అయితే జింబాబ్వే ఇటీవల జోరు మీద కనిపిస్తోంది. బంగ్లాదేశ్ జట్టుపై టీ20, వన్డే సిరీస్లను కైవసం చేసుకుని తాము బలహీనం కాదని టీమిండియాకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జింబాబ్వే ఆల్రౌండర్ ఇన్నోసెంట్ కియా టీమిండియాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. తాము భారత జట్టుకు పోటీ ఇవ్వడం కాదని… చుక్కలు చూపిస్తామని ధీమా…
KL Rahul: టీమిండియాకు శుభవార్త అందింది. ప్రతిష్టాత్మక ఆసియా కప్ టోర్నీకి ముందు కీలక ఆటగాడు కేఎల్ రాహుల్ అందుబాటులోకి వచ్చాడు. ఈనెల 18 నుంచి జింబాబ్వేతో జరగనున్న మూడు వన్డేల సిరీస్కు కేఎల్ రాహుల్ను ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమైన దృష్ట్యా జింబాబ్వే టూర్కు కేఎల్ రాహుల్ను పంపాలని సెలక్టర్లు భావించారు. దీంతో జింబాబ్వేలో పర్యటించనున్న టీమిండియా కెప్టెన్గా కేఎల్ రాహుల్ను ప్రకటించారు. అయితే గతంలో ఈ టూర్కు కెప్టెన్గా…
Shikar Dhawan Allegations on Team Selection: ఈనెల 18 నుంచి జింబాబ్వేలో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో భారత జట్టుకు శిఖర్ ధావన్ నాయకత్వం వహించనున్నాడు. ఈ క్రమంలో శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ఫార్మాట్కు తనను సెలక్టర్లు ఎందుకు ఎంపిక చేయడం లేదో అర్ధం కావడం లేదన్నాడు. అయితే ఈ విషయం గురించి తాను పెద్దగా ఆలోచించడం లేదని.. వచ్చిన అవకాశాల్లో తన అత్యుత్తమ ప్రదర్శన ఎలా…
Team India For Zimbabwe Tour: ప్రస్తుతం వెస్టిండీస్లో పర్యటిస్తున్న టీమిండియా త్వరలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. అక్కడ జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ మేరకు జింబాబ్వే వెళ్లే భారత జట్టును శనివారం నాడు సెలక్టర్లు ప్రకటించారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇతర సీనియర్ ఆటగాళ్లందరికీ ఈ పర్యటన నుంచి విశ్రాంతి కల్పించారు. ఫామ్తో తంటాలు పడుతున్న విరాట్ కోహ్లీని ఈ పర్యటన కోసం ఎంపిక చేస్తారని గతంలో జరిగిన ప్రచారంలో నిజం…