Arshdeep Singh Breaks R Ashwin T20 World Cup Record: భారత యువ బౌలర్ అర్ష్దీప్ సింగ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్లో 10 పరుగులు కంటే తక్కువ ఇచ్చి.. నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా యూఎస్ఏపై (4-0-9-4) అద్భుతమైన గణాంకాలు నమోదు చేయడంతో ఈ రికార్డు అర్ష్దీప్ ఖాతాలో చేరింది. ఈ క్రమంలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (4/11) రికార్డును అర్ష్దీప్…
Aaron Jones on USA Defeat vs IND: బ్యాటింగ్లో 10-15 పరుగులు తక్కువ చేయడమే తమ ఓటమిని శాసించిందని అమెరికా కెప్టెన్ ఆరోన్ జోన్స్ తెలిపాడు. తమ బౌలింగ్ యూనిట్ గురించి చాలా గర్వపడుతున్నానన్నాడు. మా తప్పిదాలను తెలుసుకొని పుంజుకుంటాం అని జోన్స్ ధీమా వ్యక్తం చేశాడు. అమెరికా రెగ్యులర్ కెప్టెన్ మొనాంక్ పటేల్ గాయపడడంతో ఆరోన్ జోన్స్ జట్టు బాధ్యతలు అందుకున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా బుధవారం టీమిండియాతో…
Rohit Sharma Hails Shivam Dube and Suryakumar Yadav: కఠినమైన న్యూయార్క్ పిచ్పై పరుగులు చేయడం చాలా కష్టం అని.. సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబేల అద్భుత బ్యాటింగ్తోనే తాము గెలిచాం అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అర్ష్దీప్ సింగ్ అసాధారణ ప్రదర్శన చేశాడని ప్రశంసలు కురిపించాడు. అమెరికా జట్టులోని అందరూ బాగా ఆడుతున్నారన్నాడు. సూపర్ 8కు అర్హత సాధించడం సంతోషంగా ఉందని రోహిత్ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా…
Do You Know Why USA Fined 5 Runs vs India: టీ20 ప్రపంచకప్ 2024లో అసాధారణ ప్రదర్శన చేస్తున్న అమెరికా.. భారత్తో జరిగిన మ్యాచ్లోనూ అదే జోరును కొనసాగించింది. కఠినమైన న్యూయార్క్ పిచ్పై ముందుగా బ్యాటింగ్తో అదరగొట్టిన యూఎస్ఏ.. ఆపై సువర్ బౌలింగ్తో టీమిండియాని వణికించింది. ఓ దశలో అయితే మ్యాచ్పై పట్టు సాధించి.. గెలిచేలా కనిపించింది. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్తగా ప్రవేశపెట్టిన ‘స్టాప్ క్లాక్’ రూల్ అమెరికా కొంపముంచింది.…
India Thrash United States in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ ‘హ్యాట్రిక్’ విజయాన్ని అందుకుని సూపర్-8లోకి అడుగు పెట్టింది. బుధవారం జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్లో అమెరికాపై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టోర్నీ ఆరంభం నుంచి బ్యాటర్లకు కఠిన పరీక్షగా మారిన న్యూయార్క్ స్టేడియంలో 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్ చెమటోడ్చాల్సి వచ్చింది. 3 వికెట్లు కోల్పోయి కానీ.. 18.2 ఓవర్లకు లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.…
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా.. ఈరోజు భారత్-అమెరికా మధ్య మ్యా్చ్ జరుగుతుంది. న్యూయార్క్లోని నసావు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో అమెరికా తక్కువ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లు పరుగులు చేయనీయకుండా కట్టడి చేశారు. భారత్ ముందు 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది అమెరికా. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే.. సూపర్-8లోకి ఎంట్రీ ఇస్తుంది.
టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఈరోజు ఇండియా-అమెరికా జట్ల మధ్య మ్యా్చ్ జరుగనుంది. ఈ క్రమంలో భారత్ టాస్ గెలిచింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. న్యూయార్క్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే.. టీమిండియా సూపర్-8లోకి ఎంటర్ కానుంది.
నసావు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్-అమెరికా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మైదానం పిచ్పై మొదటి నుంచి చర్చ జరుగుతోంది. డ్రాప్ ఇన్ పిచ్ ఇక్కడ ఉపయోగించబడింది. ప్రారంభంలో మ్యాచ్లు ఆడినప్పుడు.. అపరిమిత బౌన్స్ కారణంగా ఈ పిచ్పై బ్యాట్స్మెన్ సమస్యలను ఎదుర్కొన్నారు. అయితే కాలక్రమేణా పిచ్ మెరుగుపడింది. అయితే ఈ పిచ్ ఇప్పటికీ బౌలర్లకు సహాయకరంగా ఉంది. ఇక్కడ బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. బౌలర్లకు ఇక్కడ చక్కటి సహకారం లభిస్తున్నందున భారత్-అమెరికా మ్యాచ్లోనూ…
Paras Mhambrey on Hardik Pandya: హార్దిక్ పాండ్యా బౌలింగ్ సత్తాపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని, ఎప్పుడూ నమ్మకంగానే ఉన్నామని టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే తెలిపారు. ఏ ప్లేయర్ అయినా కొన్నిసార్లు లయను అందుకోవడానికి కాస్త సమయం పడుతుందన్నాడు. బౌలింగ్లో సత్తా చాటుతున్న హార్దిక్.. తప్పకుండా బ్యాటింగ్లో రాణిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. హార్దిక్ బౌలింగ్లో మంచి ప్రదర్శన చేయకపోతే.. జట్టు కూర్పుపై చాలా ప్రభావం పడేదని మాంబ్రే పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్…
USA Player Aaron Jones Says Fear is not in our Blood: భారత్పై ఎలాంటి భయం లేకుండా ఆడేస్తామని, ప్రతి మ్యాచ్లోనూ ఇలాగే ఆడేందుకు తాము ప్రయత్నిస్తున్నామని అమెరికా ప్లేయర్ ఆరోన్ జోన్స్ అన్నాడు. బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడం కఠినమే అని పేర్కొన్నాడు. పిచ్ ఎలా స్పందిస్తుందో ఇప్పుడే చెప్పలేమని జోన్స్ తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా నేడు అమెరికాతో భారత్ తలపడనుంది. న్యూయార్క్లోని నసావు కౌంటీ స్టేడియంలో రాత్రి 8…