బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నేడు రెండో టెస్ట్ ఆరంభం కానుంది. అడిలైడ్లో జరిగే ఈ డే/నైట్ టెస్టులో టీమిండియా ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్. అదే ఊపులో రెండో టెస్టులో గెలవాలని చూస్తోంది. మరోవైపు సొంతగడ్డపై ఆడుతోన్న ఆస్ట్రేలియా.. పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. పింక్ బాల్ టెస్టులో మంచి రికార్డు ఉన్న ఆసీస్.. టీమిండియాను ఓడించి సిరీస్ను 1-1తో సమం చేయాలని చూస్తోంది.…