Home
Income Tax
Income Tax News
-
Income Tax Raids: నెల్లూరులో ఐటీ దాడుల కలకలం..
నెల్లూరు నగరంలోని పలు బంగారం దుకాణాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. వ్యాపారానికి సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు ఈ దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. విజయవాడ, గుంటూరు నుంచి 40 మంది అధికారులు ఏక కాలంలో నెల్లూరు సిటీలోని 15 ప్రాంతాలపై దాడులు నిర్వహించారు.. రికార్డులను పరిశీలించి, పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.. కాగా, మరోవైపు ఇవాళ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఎంబీఎస్ జ్యువెల్లర్స్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు నిర్వహించారు.. ఎంబీఎస్ జ్యువెల్లర్స్తో పాటు ముసదిలాల్… -
DK Shiva Kumar : కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్పై ఈడీ చార్టిషీట్
మనీలాండరింగ్ కేసులో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు డీకే శివకుమార్తో పాటు తదితరులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జి షీట్ దాఖలు చేసింది. ఐటీ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో శివకుమార్ ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. ఢిల్లీ కోర్టులో ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ)లోని వివిధ సెక్షన్ల కింద ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేసినట్లు వారు తెలిపారు. ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ సెప్టెంబర్ 2018లో శివకుమార్,… -
New Rule: అలర్ట్.. పాన్ కార్డు వాడే వారికి కొత్త రూల్
పాన్ కార్డుకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) కొత్త రూల్ను ప్రకటించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల కన్నా ఎక్కువ విత్డ్రా చేసినా లేదా డిపాజిట్ చేసినా పాన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ తప్పనిసరిగా వెల్లడించాలని సీబీడీటీ వెల్లడించింది. ఈ మేరకు ఆదాయపు పన్ను నిబంధనలు-1962లో సీబీడీటీ పలు సవరణలు చేసింది. కో ఆపరేటివ్ బ్యాంకుల్లో డిపాజిట్లు, విత్డ్రాయల్స్కు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని సీబీడీటీ తెలిపింది. ఇప్పటికే ఒక… -
నిర్మలమ్మ బడ్జెట్ పై కోటి ఆశలు
కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలుచేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్పై తమకు ఊరట కల్పిస్తారని ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగులు ఇన్ కంట్యాక్స్ పరిమితి పెంచుతారని ఆశిస్తున్నారు. 80సీ కింద మినహాయింపుల పెంపుపై వేతన జీవులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సెక్షన్ 80సీ కింద గరిష్ఠంగా ఇస్తున్న రూ.1.50 లక్షల మినహాయింపుల పరిమితిని రూ.3 లక్షలకు పెంచాలని… -
ప్రపంచంలో ట్యాక్స్ ఫ్రీ దేశాలు ఎన్నున్నాయో తెలుసా?
ప్రపంచంలో దాదాపుగా ఏ దేశంలో తీసుకున్నా ట్యాక్స్లు అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ప్రజల ఆదాయంపై చాలా దేశాలు ట్యాక్స్ను విధిస్తు ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి అనేక రకాల ట్యాక్స్లను అక్కడి పరిస్థితులను బట్టి ప్రభుత్వాలు ట్యాక్స్లను విధిస్తూ ఉంటాయి. అయితే, ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఈ ట్యాక్స్ల గొడవ ఉండదట. ప్రభుత్వం ప్రజల ఆదాయంపై ట్యాక్స్ లు విధించదు. ప్రభుత్వానికి లభించే కీలకమైన ఆదాయం ద్వారా పాలన సాగిస్తుంటాయి. ప్రపంచంలో ట్యాక్స్ ఫ్రీ దేశాలు… -
ఐటీ రిటర్న్స్ గడువు పొడిగించేందుకు కేంద్రం నిరాకరణ
2020-21 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారికి కేంద్ర ప్రభుత్వం చేదువార్తను అందించింది. డిసెంబర్ 31తో ముగుస్తున్న ఐటీఆర్ దాఖలు గడువును పెంచేందుకు కేంద్రం నిరాకరించింది. ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును ఎట్టి పరిస్థితుల్లో పొడిగించే అవకాశం లేదని కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు 5.62 కోట్ల మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారని ఆయన పేర్కొన్నారు. Read Also: ఏడాదిలో చివరి రోజు… స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు… -
జీఎస్టీ మోసానికి తెరలేపిన పీయూష్.. ఇంట్లో 150 కోట్లు లభ్యం..
ఆదాయం పన్ను నుంచి తప్పించుకునేందు కొంతమంది తప్పుడు దారులను అన్వేషిస్తున్నారు. తీరా అధికారుల సోదాల అసలు విషయం బయట పడడంతో జైలు పాలవుతున్నారు. అలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్లో చోటు చేసుకుంది. యూపీ సమాజ్వాదీ పార్టీ నేత, వ్యాపారి పీయూష్ జైన్ తన వ్యాపారంలో వచ్చిన ఆదాయంపై పన్ను ఎగ్గొట్టేందుకు నకిలీ ఇన్వాయిస్లు, ఈ-వే బిల్లులు సృష్టించాడు. అంతేకాకుండా వాటిని ఉపయోగించి అధికారులను బురిడి కూడా కొట్టించారు. ఆ తరువాత అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు చేయగా… -
టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఈ ఏడాది కట్టే పన్ను ఎంతో తెలుసా?
టెస్లా అధినేత ఎలన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్నుల జాబితాలో ఆయన ఒకరు. ఈ మేరకు ఆయన ఏడాదికి ఎంత పన్ను కడతారో తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో తాను ఈ ఏడాది 11 బిలియన్ డాలర్లను పన్నుగా చెల్లించనున్నట్లు ఎలన్ మస్క్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. భారత కరెన్సీలో ఆయన కట్టే పన్ను విలువ రూ.85వేల కోట్లు అన్నమాట. దీంతో అమెరికా… -
మరోసారి ఐటీ రిటర్న్స్ గడువు పొడిగింపు..?
కరోనా మహమ్మారి ఎఫెక్ట్తో గత ఏడాది నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు గడువును పొడిగిస్తూ వచ్చింది కేంద్రం.. అయితే, మరోసారి ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును పొడిగించే అవకాశం కనిపిస్తోంది.. అయితే, ఈ సారి కొన్ని సాంకేతికపరమైన అంశాలనలో వాయిదా వేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఎందుకంటే.. రెండున్నర నెలల కిందట కొత్తగా www.incometax.gov.in సైట్ను ప్రారంభించారు.. ఇప్పటికీ కొన్ని అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి.. దీంతో.. గత ఆర్థిక సంవత్సరాని (2020-21)కిగాను ఐటీ రిటర్న్స్ దాఖలు… -
కరోనా బాధిత కుటుంబాలకు భారీ ఊరట..
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సకు అయ్యే ఖర్చు, కరోనా కారణంగా మృతి చెందిన వారికి ఇచ్చే ఎక్స్గ్రేషియాలపై పన్ను మినహాయింపులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగి.. కరోనా చికిత్సకు కంపెనీలు చెల్లించే మొత్తానికి పన్ను మినహాయింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది కేంద్రం. కరోనాతో మరణించిన ఉద్యోగి కుటుంబాలకు కంపెనీ చెల్లించే పరిహారానికి కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాగూర్ పేర్కొన్నారు. read also…
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..