వికారాబాద్ జిల్లా పరిగిలో ఉదయం పావురాలను ఎగురవేస్తుండగా పట్టుకొని పోలీసులకు అప్పగించిన ఇష్యూలో ముగ్గురు వ్యక్తులపై పరిగి పోలీసులు కేసు నమోదు చేశారు. గేమింగ్ యాక్ట్ బర్డ్స్ క్రుయాల్టీ యాక్ట్ లా కింద కేసు నమోదు చేశారు. 100 కిలోమీటర్లు ప్రైజ్ మనీ.. తర్వాత 200 కిలోమీటర్ల ప్రైస్ మనీ.. తర్వాత 300 కిలోమీటర్ల ప్రైస్ మనీ ఇలా బెట్టింగులకు పాల్పడుతున్నారు.
Betting : వికారాబాద్ జిల్లా పరిగి లక్ష్మీ నగర్ కాలనీలో ఓ ట్రాలీ ఆటోలో తెచ్చిన పావురాలను ఆకాశంలోకి వదులుతుండగా స్థానికులు పట్టుకున్నారు. అయితే.. ముందు పావురాలతో వైరస్ను వ్యాపించేందుకు ప్లాన్ చేశారనే అనుమానంతో స్థానికులు వారిని ప్రశ్నించారు. దీంతో.. వాళ్లు స్థానికులతో బేరసారాలకు దిగారు. దీంతో పావురాల బెట్టింగ్ కథ బయటపడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. బెట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. లక్ష్మీ నగర్ కాలనీలో ఓ ట్రాలీ ఆటోలో పావురాలను తెచ్చి పందెం…