T20 World Cup Controversy: మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఇప్పటికే పాల్గొనే జట్లు ప్రాక్టీస్ లో మునిగిపోయాయి. టీమిండియా సైతం ఎలాగైనా టైటిల్ సాధించుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు.. పాకిస్థాన్ టీం నాటకీయ పరిస్థితి ముదురుతోంది. ఈ నేపథ్యంలో తమకు సపోర్టుగా నిలిచిన పాకిస్థాన్ నిర్ణయంపై బంగ్లాదేశ్ స్పందించింది. బంగ్లాదేశ్ యువజన, క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్కు కృతజ్ఞతలు తెలిపారు. బంగ్లాదేశ్ను టోర్నమెంట్ నుంచి తొలగించిన నిర్ణయానికి…
భద్రత కారణాల దృష్ట్యా భారత్లో టీ20 వరల్డ్కప్ 2026 మ్యాచ్లు ఆడటానికి బంగ్లాదేశ్ నిరాకరించిన విషయం తెలిసిందే. బంగ్లాను మెగా టోర్నీ నుంచి ఐసీసీ బహిష్కరించింది. బంగ్లాదేశ్కు సంఘీభావంగా తాము కూడా టోర్నీ నుంచి వైదొలుగుతామని పాకిస్థాన్ టీం కామెంట్స్ చేసింది. ఈ నేపథ్యంలో పాక్ మెగా టోర్నీలో ఆడుతుందా? లేదా? అనే సస్పెన్స్ కొనసాగుతోంది. టీ20 వరల్డ్కప్ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ టోర్నీలో పాల్గొనాలా? వద్దా?…
T20 World Cup: భారత్లో ఆడమని ప్రకటించి బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ నుంచి బహిష్కరణకు గురైంది. బంగ్లాకు మద్దతుగా తాము కూడా టోర్నీని బహిష్కరిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) ప్రగల్భాలు పలికింది. అయితే, టోర్నీని బాయ్కాట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఆంక్షలు విధిస్తామని ఐసీసీ హెచ్చరించింది. ఈ దెబ్బతో పాకిస్తాన్ దిగొచ్చింది. చివరకు టీ20 ప్రపంచ కప్ 2026 కోసం తన జట్టును ప్రకటించింది. ఐసీసీ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే పీసీబీ 15 మందితో…