ఆంధ్రప్రదేశ్ ఏపీ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా. హైమవతి ఒమిక్రాన్ కేసులపై ప్రస్తుతం రాష్ర్టంలో ఉన్న పరిస్థితులపై మీడియాతో మాట్లాడారు. రాష్ర్టంలో ప్రస్తుతం రెండు ఒమిక్రాన్ యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు.కేంద్రం డిసెంబర్ మొదటి తేదీ నుంచి కోవిడ్ నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చిందని తెలిపారు. రాష్ర్టంలో 99శాతం మందికి మొదటి డోసు వేయడం పూర్తయిందని వెల్లడించారు. మేము నవంబర్ చివరి వారం నుంచే ప్రయాణికులను ట్రేస్ చేయటం ప్రారంభించడంతో కేసులు పెరగకుండా చూడగలిగామని పేర్కొన్నారు. 72 శాతం…
విదేశాల నుండి వచ్చిన 30 మంది ప్రయాణికులు మిస్సయ్యారనే వార్తల్లో వాస్తవం లేదు అని ఏపీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ హైమావతి తెలిపారు. ఇలాంటి వదంతుల్ని ఎవరూ నమ్మొద్దు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని హైమావతి అన్నారు. అయితే వైజాగ్ , సమీప జిల్లాలకు చెందిన 30 మంది అంతర్జాతీయ ప్రయాణికుల వివరాల్ని కేంద్రం పంపించింది. వారివారి ఇళ్లల్లో ఐసోలేషన్లో ఉండేలా మా వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. డైరెక్ట్ గా ఏపీలో విదేశీ ప్రయాణికులు…