రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. జిల్లాలోని అనేక ప్రాంతాలతో పాటు.. సిరిసిల్లా టౌన్ లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.. పార్క్ చేసిన కార్లు.. పడవలుగా మారిపోయాయి కొట్టుకుపోయాయి.. ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో అయితే.. ముంపులో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నవారు మరికొందరు.. అయితే, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సిరిసిల్లాకు బయల్దేరాయి జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు.. హైదరాబాద్లో వరదల సమయంలో.. డీఆర్ఎఫ్ బృందాలు చాలా కీలక పాత్ర పోషించాయి..…
వినాయక చవితి అంటే మనకు హైదరాబాద్ గుర్తుకు వస్తుంది. హైదరాబాద్లో వేలాది మండపాల్లో వినాయకులు కొలువుదీరుతారు. అన్నింటికంటే స్పెషల్ ఎట్రాక్షన్గా కనిపించే వినాయకుడు మాత్రం ఖైరతాబాద్ వినాయకుడే అని చెప్పాలి. ఎందుకంటే, ప్రతి ఏడాది అడుగుచొప్పున పెంచుకుంటూ ఒక్కో ఏడాది ఒక్కో అవతారంలో గణపయ్య దర్శనం ఇస్తుంటారు. గతేడాది కరోనా కాలంలో కూడా మహాగణపతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హైదరాబాద్కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 10 వ తేదీన వినాయక చవితి కావడంతో…
ఈనెల 2 నుంచి టిఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంను ప్రారంభించింది. గ్రామ,వార్డు కమిటీల ఏర్పాటు మొదలైంది. ఇటు ఈ నెలలోనే జిల్లా కమిటీలతో పాటు అనుబంధ కమిటీల ఏర్పాటును పూర్తి చేయాలని పట్టుదలతో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన కమిటీల ఏర్పాటుపై ఇవాళ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. గ్రేటర్ పరిధిలోని ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. కమిటీల ఏర్పాటుపై సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.టిఆర్ఎస్ ప్రస్థానం ప్రారంభమైనప్పటి…
ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. ఈ బంగారాన్ని కొనుగోలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత మూడు రోజుల నుంచి తగ్గిన బంగారం ధరలు… తాజాగా స్థిరంగా నమోదయ్యాయి. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 44,510 కి చేరింది.…
తెలంగాణలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి.. ఇక, హైదరాబాద్ మహా నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.. ఓవైపు జంట జలశాయాలు నిండు కుండల్లా మరడంతో.. గేట్లను ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. లోతట్టు ప్రాంతాలో ఇళ్లలోకి నీరు చేరి పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. ఇక, వాహనదారులు రోడ్లపైకి రావాలంటేనే వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం పడనుందని హెచ్చరించింది వాతావరణశాఖ.. సాయంత్రం 6 గంటల నుంచి 8…
హైదరాబాద్ లో ఈరోజు, రేపు, ఎల్లుండి మూడు రోజులు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది అని ఎన్టీవీతో వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న అన్నారు. రాష్ట్రంలో రుతుపవనాలు… దట్టంగా అలుముకున్న క్యూములో నింబస్ మేఘాలు చురుగ్గా కదులుతున్నాయి. అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది అని తెలిపారు. కాబట్టి ఆ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అందుకే గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా 16 జిల్లాలకు…
ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనానికి పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేసారు. అయితే హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ నేడు ఆ ఏర్పాట్లను పరిశీలించారు. ట్యాంక్ బండ్ పై చేసిన సుందరీకరణ దెబ్బతినకుండా ట్రయిల్ రన్ నిర్వహించారు అధికారులు. అనంతరం సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ… గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక మైన ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరగా నిమజ్జనం చేసేందుకు ఆటోమేటిక్ ఐడల్ రిలీజ్ సిస్టం ని వాడుతున్నాం. అలాగే ట్యాంక్ బండ్ పై ఈ సారి క్రేన్ల…
విరసం నేత, ప్రముఖ కవి వరవరరావు బెయిల్ను మరోసారి పొడిగించింది బాంబే హైకోర్టు.. దాంతో పాటు షరతులు కూడా కొనసాగించింది… తెలంగాణ రాష్ట్రానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వరవరరావు దాఖలు చేసిన పిటిషన్ను సెప్టెంబర్ 24వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.. సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఇదే స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఈ నెల 24వ తేదీ వరకు బాంబేలోనే ఉండాలని స్పష్టం చేసింది. కాగా, ఎల్గార్ పరిషద్ కేసులో జ్యుడీషియల్ రిమాండ్లో వున్న వరవరరావుకు…
హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. ఇవాళ్టి నుంచి మరో అరగంటపాటు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. నేటి నుంచి రాత్రి వేళల్లో 10 గంటల 15 నిమిషాలకు చివరి మెట్రో సర్వీసు ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు రాత్రి 9 గంటల 45 నిమిషాల వరకు చివరి మెట్రో రైలు సర్వీసులు నడిచేవన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైళ్ల సమయాలను పొడిగించినట్లు వెల్లడించారు. ఇక మెట్రో తీసుకున్న తాజా నిర్ణయం తో ప్రయాణికులకు…
ఉప్పల్ లో ఘరానా మోసాలకు పాల్పడ్డాడు ఓ పాస్టర్. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకొని మోసం చేసిన ఆ కీచక పాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే…. ఉప్పల్ లోని గాస్పల్ చర్చి కు పాస్టర్ గా ఉన్న జోసఫ్ అలియాస్ సాధు… కొన్ని టీవీ ఛానళ్లలో మత ప్రభోధకుడు గా పని చేస్తూ అమాయక ఆడపిల్లను టార్గెట్ చేశాడు. చర్చికి వచ్చే అమ్మాయిలను లొంగదీసుకొని మోసం చేస్తున్నాడు పాస్టర్ జోసఫ్.…