Hyderabad: హైదరాబాద్లో దారుణ ఘటన వెలుగు చూసింది. నడిరోడ్డులో యువకుడిపై కత్తి దాడి కలకలం సృష్టించింది. అందరూ చూస్తుండగానే ఓ యువకుడు మరో వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డినగర్ కి చెందిన రోషన్సింగ్(25) ఓ రౌడీషీటర్. జగద్గిరిగుట్ట పరిధి సోమయ్యనగర్కు చెందిన బాలశౌరెడ్డి(23) సైతం పాత నేరస్థుడు. రోషన్సింగ్ 15 రోజుల క్రితం ఓ ట్రాన్స్జెండర్ను మాట్లాడుకుని రంగారెడ్డినగర్లోని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. డబ్బులు చెల్లించే విషయంలో ఇరువురి…
Chiranjeevi : సోషల్ మీడియాలో సినీనటుడు మెగాస్టార్ చిరంజీవిని లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు, డిప్ ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో డీసీపీ కవిత మీడియాతో మాట్లాడారు. డీసీపీ కవిత వివరాల ప్రకారం.. చిరంజీవి ఫిర్యాదు మేరకు ఇప్పటివరకు రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చిరంజీవి ఫిర్యాదుతో రెండు కేసులు నమోదు చేసామన్నారు. 25 పోస్టులకు పైగా గుర్తించామని, వాటిపై దర్యాప్తు…
CP Sajjanar: సర్దార్ వల్లభాయ్ పటేల్ను యువత ఆదర్శంగా తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. మంచి సమాజ నిర్మాణం కోసం యువత పాటు పడాలన్నారు. పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివాస్ (జాతీయ ఐక్యత దినోత్సవం) జాతీయ ఐక్యత కోసం 5K RUN కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రసంగించారు. మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫెక్ అంశాన్ని సీరియస్ తీసుకున్నామని స్పష్టం చేశారు. డీప్ ఫెక్ కేసులో సైబర్ నేరస్తుల మూలాలపై ఫోకస్ పెట్టామన్నారు..…
CP Sajjanar: వాట్సప్ కాల్స్ రికార్డ్ చేస్తున్నారంటూ ప్రచారం సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. రేపటి నుంచి అన్ని ఆడియో వీడియో వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. జనాలకు సంబంధించిన అన్ని సోషల్ మీడియా అకౌంట్లు పర్యవేక్షిస్తామని, కాల్స్ రికార్డు చేస్తామని ఓ పోస్ట్లో తప్పుడు వార్తను షేర్ చేశారు. ఈ అంశంపై తాజాగా సీపీ సజ్జనార్ స్పందించారు. తన ఫొటోతో ముద్రించిన ఈ నకిలీ పోస్ట్పై సీరియస్ అయ్యారు. వాట్సప్ కాల్స్ రికార్డ్…
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై మరోసారి ఫిర్యాదు చేశారు. తనపై అభ్యంతరకర పోస్టులు పెడుతూ, దుర్భాషలాడుతున్న కొన్ని ‘X’ హ్యాండిల్ ప్రొఫైల్స్ను జతచేస్తూ ఆయన తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్, వ్యక్తిగత దూషణలకు సంబంధించి గతంలో సిటీ సివిల్ కోర్ట్ అనుకూలంగా తీర్పు ఇచ్చినా, ఇంకా కొందరు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వల్గర్ కామెంట్స్ చేస్తున్నారని చిరంజీవి ఫిర్యాదులో పేర్కొన్నారు. Also Read:Khawaja Asif:…
Bribe : హైదరాబాద్ నగర పోలీస్ విభాగాన్ని కుదిపేసే ఘటన బయటపడింది. రూ.3 వేల కోట్ల భారీ ఆర్థిక మోసం చేసి ముంబైకి పారిపోయిన నిందితుడిని పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందంలోని ఎస్ఐ అక్రమ డీల్లో పాల్గొన్నట్టు తేలింది. వివరాల్లోకి వెళ్తే.. మోసం కేసులో కీలక నిందితుడు ముంబైలో దొరికిపోవడంతో, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అతని అరెస్టుకు ఆదేశించారు. ఆ బృందంలో ఉన్న ఒక ఎస్ఐ నిందితుడిని…
VC Sajjanar: హైదరాబాద్ మహానగరంలోని చాదర్ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్లో జరిగిన కాల్పుల ఘటన స్థలాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (CP) సజ్జనార్ పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీతో పాటు క్లూస్ టీం పోలీసులు సంఘటన స్థలంలో ఆధారాలను సేకరించారు. ఇక ఈ ఘటనపై సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ.. రౌడీలు, స్నాచర్స్పై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. ఈ ఘటన ఈరోజు సాయంత్రం 5 గంటలకు చాదర్ఘాట్ విక్టోరియా ప్లేగ్రౌండ్ వద్ద జరిగిందని ఆయన తెలిపారు.…
Hyderabad: హైదరాబాద్ మహానగరంలో తాజాగా కాల్పుల కలకలం చోటుచేసుకుంది. చాదర్ఘాట్ ప్రాంతంలో సెల్ఫోన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ఓ దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనలో సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై దొంగ కత్తితో దాడికి యత్నించగా.. డీసీపీ స్వయంగా కాల్పులు జరిపారు. సెల్ఫోన్ స్నాచింగ్ చేస్తున్న దొంగను పట్టుకోవడానికి డీసీపీ చైతన్య ప్రయత్నించారు. ఈ సమయంలో ఆ దొంగ డీసీపీ చైతన్యపై కత్తితో దాడికి యత్నించాడు. ఈ తోపులాటలో డీసీపీ గన్మ్యాన్ కిందపడటంతో,…
Students Missing Case : నర్సాపూర్ మైనార్టీ గురుకులంలో నిన్న అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. హైదరాబాద్లో తండ్రి వద్ద ఉన్నారని తెలిసిన నేపథ్యంలో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. వరాల్లోకి వెళ్తే.. నర్సాపూర్ మైనార్టీ గురుకులంలో చదువుతున్న అన్నదమ్ములు అమీర్ (12), అలీ (11) నిన్న మధ్యాహ్నం ఆటల సమయంలో స్కూల్ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లిపోయారు. వారి గురించి వెతికినా ఆచూకీ లభించకపోవడంతో గురుకుల ప్రిన్సిపాల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.…
VC Sajjanar : రోజురోజుకు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు ప్రజల్లో పాపులారిటీ సాధించేందుకు వేదికగా మారాయి. అయితే, కొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా క్రియేటర్లు ఈ అవకాశాన్ని అశ్లీల కంటెంట్ ప్రసారం చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాస్ వార్నింగ్ ఇవ్వడంతో యూట్యూబ్ ఛానెళ్లు, ఇన్స్టాగ్రాం రీల్స్లో క్రమంగా వీడియోలను తొలగించాయి. Mujra Party : అమ్మాయిలతో విందులో చిందులు.. చిక్కిన నేతలు వీసీ సజ్జనార్ ఇటీవల సోషల్…