ఇటీవల మెట్రో రైలులో ఓ అమ్మాయి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో మెట్రో రైలు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులను ఇబ్బంది పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీడియో చేసిన యువతిపై మెట్రో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా ప్రజలకు హైదరాబాద్ మెట్రో సంస్థ స్ట్రాంగ్ నోటీసు ఇచ్చింది.
ఈరోజుల్లో కుటుంబ కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడుతున్నారు యువత. అడపదడప రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వ్యూస్ కోసం తాపత్రయ పడుతున్నారు. రీల్స్ చేయడానికి ఒక ప్లేస్ అంటూ లేకుండా ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేసేందుకు వెనకాడటం లేదు. ఒకరు చూస్తారనే భయంలేదు. విచ్ఛలవిడిగా రీల్స్ చేసి దానిని పోస్ట్ చేసి కామెంట్స్, వ్యూస్ కోసం తాప్రతయ పడుతున్నారు. రోడ్డు, పార్క్, వాష్ రూమ్స్ రీల్స్…